న్యూఢిల్లీ, జూన్ 23: కొనుగోలుదా రులకు హీరో మోటోకార్ప్ షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మోటర్సైకిల్, స్కూటర్ల ధరలను రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. ఆయా మోడళ్ళను బట్టి ధరల పెంపు ఉంటుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ రూ.51,450 ధర కలిగిన హెచ్ఎఫ్ 100 మోడల్తోపాటు రూ.1.32 లక్షల లోపు ఎక్స్పల్స్ 200 4వీ బైకులను దేశీయంగా విక్రయిస్తున్నది.