Tax on Diwali Gifts | ధంతేరాస్.. దీపావళి పర్వదిన వేడుకల్లో ప్రారంభం.. ఇండియన్స్ సంబురంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. అత్తింటికి వచ్చే కొత్త అల్లుడికి.. వివిధ కంపెనీలు తమ సిబ్బందికి గిఫ్ట్లు ఇస్తుంటాయి. ఇలా పొందే గిఫ్ట్లన్నింటికీ ఇన్కం టాక్స్ రాయితీ ఉండదు. దీపావళి సందర్భంగా అందుకునే గిఫ్ట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే గిఫ్ట్లపై విధించే పన్ను ఎంత ఉంటుందో ఇన్కం టాక్స్ యాక్ట్- 1961లో క్లియర్ కట్ రూల్స్ ఉన్నాయి. గిఫ్ట్ల విలువ రూ.50 వేలు దాటితే పన్ను పే చేయాల్సిందే. బట్, సమీప బంధు మిత్రుల నుంచి పొందే గిఫ్ట్లకు మాత్రం రాయితీ ఉంటుంది. ఇక కంపెనీలు ఇచ్చే గిఫ్ట్లు ఒక ఏడాదిలో రూ.5,000 దాటితే పన్ను పే చేయాలి.
ఇద్దరు మిత్రుల్లో ఒకరు ఇచ్చే గిఫ్ట్ రూ.30 వేలు, మరొకరు ఇచ్చే గిఫ్ట్ కూడా రూ.30 వేలు ఉందనుకుందాం.. ఇక ఆర్థిక సంవత్సరంలో సదరు వ్యక్తికి అందిన గిఫ్ట్ల విలువ మొత్తం రూ.60 వేలు. ఇది పన్ను రాయితీని దాటేసింది. కనుక రూ.60 వేలపై పన్ను చేయాల్సి ఉంటుంది.
ఆదాయం పన్ను చట్టంలోని 56 (2) సెక్షన్ ప్రకారం సమీప బంధువులు, సన్నిహితులెవరో తెలియ జేస్తుంది. ఈ జాబితాలోకి వచ్చే వారి నుంచి గిఫ్ట్ పొందితే.. వాటి విలువతో సంబంధం లేకుండా పన్ను రాయితీ ఇస్తారు.
భార్య లేదా భర్త, సోదరి లేదా సోదరుడు, జీవిత భాగస్వామి సోదరుడు లేదా సోదరుడు, సోదరి లేదా సోదరుడి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తల్లిదండ్రుల సోదరులు, సోదరీమణులు, తాతలు, నానమ్మ, అమ్మమ్మ, జీవిత భాగస్వామ్య వంశస్తులు ఇచ్చే గిఫ్ట్లపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక తల్లిదండ్రుల తోడబుట్టిన వారి సంతానం.. బంధువులు సన్నిహిత జాబితాలోకి రారని ఆర్థికవేత్తలు చెప్పారు. ఇటువంటి వారి నుంచి వచ్చే గిఫ్ట్లపై పన్ను పే చేయాల్సి ఉంటుంది.
ఆదాయం పన్ను చట్టం ప్రకారం క్యాష్ గిఫ్ట్లు, చర, స్థిరాస్తుల రూపంలో వచ్చే బహుమతులపై టాక్స్ మినహాయింపు పొందలేరు. కాకపోతే పెండ్లి టైంలో వచ్చే ద్రవ్య రూప గిఫ్ట్లకు మాత్రం టాక్స్ రాయితీలు ఉంటాయి.
ఇక షేర్లు, సెక్యూరిటీలు, నగలు, పెయింటింగ్స్, శిల్పాలు, బంగారం వంటి ఏ కళా వస్తువునైనా గిఫ్ట్గా భావిస్తారు. క్రిప్టో కరెన్సీలు, ఎన్ఎఫ్టీలతోపాటు ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల పరిధిలోని వాటిని చరాస్తుల జాబితాలో చేరుస్తూ ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఐటీ చట్టంలో సవరణలను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ యాక్ట్ పరిధిలోకి రాని ఏ వస్తువులకు పన్ను పే చేయనవసరం లేదని టాక్స్ ప్రొఫెషనల్స్ అంటున్నారు.