హైదరాబాద్, జూలై 4: భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ.. ఈ నెల 7న హైదరాబాద్లో ఐటీ కన్క్లేవ్ 2023ను నిర్వహించబోతున్నది. ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
టెక్నాలజీ రంగం లో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో కృత్రిమ మేధస్సుతో డిజిటల్ రంగంలో రానున్న మార్పులు, మార్కెట్ పరిస్థితులు, విద్యా, టెక్నాలజీ విభాగాలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చించనున్నారు.