IRCTC | రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటైన ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో సాంకేతిక లోపంతో గురువారం ఉదయం అంతరాయం ఏర్పడింది. ఫలితంగా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి. తత్కాల్ సమయంలో యూజర్లు పలు ఇబ్బందుల పాలయ్యారు. కొన్ని గంటల తర్వాత యూజర్లకు సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు అధికారికంగా వచ్చాయని ఐఆర్సీటీసీ తన అఫిషియల్ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.
తాము రైలు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని పేర్కొంటూ గురువారం ఉదయం నుంచి పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికలపై పోస్టులు పెట్టారు. టికెట్ బుక్ చేస్తుంటూ ఎర్రర్ అని మెసేజ్ వస్తున్నదంటూ.. స్క్రీన్ షాట్లు షేర్ చేశారు. టికెట్లు బుక్ చేసినప్పుడు మెయింటెనెన్స్ కారణంగా ఈ-టికెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని ఎస్ఎంఎస్ వస్తున్నదని పేర్కొన్నారు. ఐఆర్సీటీసీ యాప్లో ‘అనేబుల్ టు కనెక్ట్’ అనే మెసేజ్ వస్తుందని యూజర్లు తమ పోస్టుల్లో తెలిపారు.
దీనిపై ఐఆర్సీటీసీ రియాక్టయింది. సాంకేతిక కారణాలతో ఈ-టికెట్ బుకింగ్లో అంతరాయం ఏర్పడిందని ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన తర్వాత మధ్యాహ్నం 1.55 గంటలకు తమ సేవలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయని ఐఆర్సీటీసీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. కానీ, సాంకేతిక లోపం ఏమిటన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు.
E ticket booking has been resumed at 13:55 hrs . https://t.co/InyUIovOma
— IRCTC (@IRCTCofficial) November 23, 2023