Supreme Court | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎల్అండ్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ చేపట్టిన కేపీసీఎల్ షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్అండ్టీకి నిరాశే ఎదురైంది. చివరకు ఈ ప్రాజెక్టు మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దక్కించుకున్నది. ఈ టెండర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డ ఎల్అండ్టీ.. ఆ తర్వాత సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
మెయిల్, కేపీసీలను ప్రతివాదులుగా చేర్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఎల్అండ్టీ పిటిషన్ను సోమవారం కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై వాదనలు సుదీర్ఘంగా విన్న తర్వాత పిటిషన్ను కొట్టివేసింది. టెండర్ దాఖలుకు రాష్ట్రం తగినంత సమయం మంజూరు చేసిందని, ఆ సంస్థ బిడ్ను సమర్పించలేకపోయిందని పేర్కొంది. ఎలక్ట్రో-మెకానికల్, హైడ్రో-మెకానికల్ పనులలో అనుభవం లేని ఎల్అండ్టీ ఈ టెండర్లలో పాల్గొనడానికి అర్హత లేదని తెలిపింది. దీంతో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న 2000 మెగావాట్ల షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు మెఘా వశమైంది.