Investers Wealth | అంతర్జాతీయ బలహీనతల వల్ల వరుసగా రెండు సెషన్లలో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఫలితంగా రూ.6.47 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరీమంది. సోమవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 617.26 శాతం నష్టపోయి 56.579.89 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం సెషన్లోనూ 714.53 పాయింట్ల నష్టంతో 57,195.15 పాయింట్ల వద్ద స్థిర పడింది. రెండు రోజుల్లో ఈక్విటీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6,47,484.72 కోట్లు హరించుకుపోయింది. ఫలితంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,65,29,671.65 కోట్లకు చేరుకున్నది.
ఆసియా మార్కెట్లలో బలహీనతల ప్రభావంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు నష్టాల బారీన పడ్డాయి. నిఫ్టీ దిగువ స్థాయి నుంచే ట్రేడింగ్ మొదలైంది. సోమవారం ఉదయం నుంచి రోజంతా నిఫ్టీలో ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు.
ధరల పెరుగుదలతోపాటు కార్పొరేట్ ఫలితాలు, సమీప భవిష్యత్లో అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచనున్నది. కనుక సమీప భవిష్యత్లోనూ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు గురవుతాయని సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు.
సోమవారం టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, లార్సెన్ అండ్ టర్బో, సన్ ఫార్మా తదితర సంస్థల షేర్లు 4.47 శాతం వరకు పతనం అయ్యాయి. భిన్నంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, నెస్ట్లే, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ 0.75 శాతం వరకు లాభ పడ్డాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.88, మిడ్ క్యాప్ 1.86 శాతం నష్టంతో ముగిసింది.