హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు..తాజాగా ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మరో 4 కంపెనీలు ముందుకొచ్చాయి. వీటిలో 3 కంపెనీలు కలిసి రూ.397 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. మరో కంపెనీ తమ పెట్టుబడి వివరాలను వెల్లడించాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించిన సోమవారం ఈ నాలుగు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొన్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు.
పెట్టుబడి పెట్టనున్న కంపెనీలు ఇవే..