హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐసీఆర్బీవో) సదస్సు జరుగబోతున్నది. ఏడోసారి జరుగుతున్న ఈ సదస్సుకు ఎస్ఈఏ అసోసియేషన్గా వ్యవహరిస్తున్నది. భారత్లో రెండోసారి జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు చైనా, థాయ్లాండ్, జపాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు చెందిన 400 మంది రైస్ బ్రాన్ ఆయిల్ తయారీదారులు హాజరుకాబోతున్నారు. ఈ సదస్సులో రైస్ బ్రాన్ ఆయిల్ తయారీకి సంబంధించి నూతన టెక్నాలజీ, వివిధ పరికరాలు ప్రదర్శించనున్నారు.