Infosys | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది 45 వేల మంది ఫ్రెషర్స్ను నియమించుకోనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇంతకుముందు జూన్ త్రైమాసికం ముగిసిన తర్వాత 35 వేల మందిని మాత్రమే నియమించుకుంటామని తెలిపిది. ఐటీ సర్వీసులకు డిమాండ్ పెరిగిందని ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్ రావు వ్యాఖ్యానించారు. క్యాంపస్ సెలక్షన్స్ పెరుగుతాయన్నారు.
క్యాంపస్ సెలెక్షన్స్తోపాటు ఉద్యోగుల హెల్త్, వెల్నెస్ చర్యలు, రీ స్కిలింగ్ ప్రోగ్రామం, కెరీర్ గ్రోత్ అవకాశాలను విస్తరిస్తామని తెలిపింది. టెక్నాలజీ కోసం అసాధారణ యుద్ధం నేపథ్యంలో ప్రతిభావంతులైన నిపుణుల అట్రిక్షన్ రేటు పెరుగుతున్నది. ఇన్ఫోసిస్ వెల్లడించిన నివేదిక ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికం నాటికి సంస్థలో అట్రిక్షన్ రేటు 20.1 శాతంగా ఉంది. గతేడాది అది 12.8 శాతం మాత్రమే. ప్రస్తుతం ఇన్పోసిస్లో 2,79,617 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.