Infosys | ఐటీ మేజర్ ఇన్పోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్ త్రైమాసికం నికర లాభంలో దాదాపు 11 శాతం కన్సాలిడెట్ గ్రోత్ నమోదు చేసింది. మార్కెట్ అంచనాల కన్నా తక్కువ. మార్కెట్ వర్గాలు రూ.6150 కోట్ల నికర లాభం గడిస్తుందని భావిస్తే, ఇన్ఫీ నికర లాభం రూ.5,945 కోట్లకు మాత్రమే పరిమితమైంది. గతేడాది (2022-23)లో రూ.5,362 కోట్ల నికర లాభం గడించింది. అంతే కాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భవిష్యత్ రెవెన్యూ గ్రోత్ అంచనాల్లోనూ కోత విధించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కన్సాలిడెట్ రెవెన్యూలో 10 శాతం గ్రోత్ సాధించింది. గతేడాది తొలి త్రైమాసికంలో రూ.34,470 కోట్ల రెవెన్యూ సంపాదిస్తే, ఈ ఏడాది రూ.37,933 కోట్ల ఆదాయం పెంచుకున్నది..
అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదొడుకుల నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సర భవిష్యత్ రెవెన్యూ గ్రోత్ అంచనాలు భారీగా తగ్గించేసింది. ఇంతకుముందు 4-7 శాతం గ్రోత్ సాధిస్తామని అంచనా వేసిన ఇన్ఫోసిస్.. ఇప్పుడు 1-3.5 శాతం మధ్యే ఉండొచ్చునని అంచనా వేస్తున్నది. నిర్వహణ లాభాల్లో 20-22 శాతం గ్రోత్ నమోదవుతుందని తెలిపింది.