న్యూఢిల్లీ : భారత్లో ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి కంటే తక్కువ ఉన్న తన ఉద్యోగులందరికీ వేతన పెంపును వాయిదా వేయాలని నిర్ణయించింది. ఏటా ఏప్రిల్ నుంచి తన ఉద్యోగులందరికీ ఇన్ఫోసిస్ వేతన పెంపును చేపడుతుంది. ఆర్ధిక సంవత్సరం తొలి క్వార్టర్లో (జూన్) వేతన పెంపునకు అర్హులైన ఉద్యోగులకు సవరించిన వేతనం అందాల్సిఉండగా ఈసారి అలాంటిదేమీ లేదని పలువురు ఉద్యోగులు తెలిపారు.
అసలు వేతన పెంపు ఎప్పటి నుంచి అమలవుతుందనే వివరాలు తమకు తెలియదని కూడా ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం తమకు అందలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
పలు కంపెనీలు లేఆఫ్స్కు తెగబడుతుండటం, ఐటీ రంగంలో స్ధూల ఆర్ధిక పరిస్ధితుల్లో అనిశ్చిత వాతావరణం నేపధ్యంలో ఇన్ఫోసిస్లో వేతన పెంపుపై సందిగ్ధం నెలకొనడం టెకీల్లో గుబులు రేపుతోంది. గతంలో 2020లో కొవిడ్-19 వ్యాప్తి నేపధ్యంలో ఇన్ఫోసిస్ వేతన పెంపును వాయిదా వేసింది. అయితే ఆపై ఏడాది జనవరిలో పరిస్ధితి కుదుటపడగానే కంపెనీ వేతన పెంపును వర్తింపచేసింది.
Read More :
Tata iPhone | యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. టాటా ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్..