న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంద్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. ఈ సందర్భంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థికలోటును ( Fiscal deficit ) 6.4 శాతానికి తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 6.9గా అంచనా వేసుకున్న ఆర్థికలోటు లక్ష్యాన్ని వచ్చ ఆర్థిక ఏడాది కోసం మరింత కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆర్థిక ఏడాదికి దేశ జీడీపీలో ఆర్థిక లోటు 6.9 శాతానికి తగ్గుతుందని అంచనావేస్తున్నాం. వచ్చే ఆర్థిక ఏడాదికి (2022-23) దాన్ని 6.4 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలా క్రమంగా ఆర్థిక లోటును తగ్గించుకుంటూ 2025-26 ఆర్థిక ఏడాదికల్లా 4.5 శాతానికి తగ్గించాలన్నది దీర్ఘకాలిక లక్ష్యమని చెప్పారు.