Sensex | ముంబై, జూలై 6: స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగిస్తున్నది. రోజుకొక శిఖరాగ్రానికి చేరుకుంటున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తుండటం, బ్లూచిప్ సంస్థల షేర్లు భారీగా పుంజుకోవడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఆల్టైం హైకీ చేరుకున్నది. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 339.60 పాయింట్ల లాభంతో 65,785.64 పాయింట్ల వద్ద ముగిసింది.
సూచీకి ఇదే గరిష్ఠ స్థాయి ముగింపు. ఎస్ఎన్ఈ నిఫ్టీ సైతం 19,500 పాయింట్ల మైలురాయిని తచ్చాడింది. ఇంట్రాడేలో 114 పాయింట్లు పెరిగి 19,512 పాయింట్లను తాకిన సూచీ చివరకు 99 పాయింట్లు అందుకొని 19,497.30 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరుల సంపద రికార్డు స్థాయి రూ.300 లక్షల కోట్లు అధిగమించింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.3,01,70,635.89 కోట్లకు చేరుకున్నది.