ముంబై, మే 6: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల మధ్య మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 866.65 పాయింట్లు లేదా 1.56 శాతం పడిపోయి 54,835.58 వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఏకంగా 1,115.48 పాయిం ట్లు క్షీణించింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 271.40 పాయింట్లు లేదా 1.63 శాతం దిగజారి 16,411.25 వద్ద నిలిచింది. సెన్సెక్స్లో బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ అత్యధికంగా 4.91 శాతం పతనమైంది. బీఎస్ఈ స్మాల్క్యాప్ 2.1 శాతం, మిడ్క్యాప్ 2.06 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక ఈ వారం మొత్తం గా సెన్సెక్స్ 2,225.29 పాయిం ట్లు లేదా 3.89 శాతం, నిఫ్టీ 691.30 పాయింట్లు లేదా 4.04 శాతం క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా, దక్షిణ కొరియా సూచీలు నష్టపోగా, జపాన్ లాభాలను అందుకున్నది. ఐరోపాలోబ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.
రూ.4.47 లక్షల కోట్లు మటాష్
ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేయడంతో బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.4,47,172.57 కోట్లు క్షీణించి రూ.2,55,17, 716.80 కోట్లకు దిగింది.
రూపాయి ఢమాల్
డాలర్తో పోల్చితే రూ పాయి మారకం విలువ మరింత దిగజారింది. ఫారెక్స్ మార్కెట్లో 55 పైసలు క్షీణించి 76.90 వద్ద స్థిరపడింది.
నష్టాలకు కారణాలు ఇవీ..