న్యూఢిల్లీ, జూలై 8: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నది. అన్ని రకాల రుణాలపై ఈ నెల 10 నుంచి అమలులోకి రానున్నది. దీంతో బ్యాంక్ వడ్డీరేట్లు 6.95 శాతం నుంచి 7.55 శాతం మధ్యలోకి చేరాయి. అత్యధిక మంది తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన వాహన, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీరేటు 7.45 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది. అలాగే రెండు, మూడేండ్ల ఎంసీఎల్ఆర్ కూడా 7.55 శాతానికి చేరుకున్నది.