Raghuram Rajan | శ్రీలంక, పాకిస్థాన్ల పరిస్థితి మన దేశ ఆర్థిక వ్యవస్థకు రాబోదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలను పెంచడంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మంచి కృషి చేస్తున్నదని తెలిపారు. భారత్కు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని ఏఎన్ఐతో చెప్పారు. మన విదేశీ రుణాలు కూడా తక్కువేనని అన్నారు. కనుక శ్రీలంక, పాకిస్థాన్ వంటి సమస్యలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు రాబోవన్నారు. పెరిగిన ధరల ప్రభావాన్ని కట్టడి చేయడానికి కీలక వడ్డీరేట్లు పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం దోహద పడుతుందన్నారు.
ఈ నెల 22తో ముగిసిన వారానికి భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు 571.56 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో 1.152 బిలియన్ల డాలర్ల ఫారెక్స్ నిల్వలు తగ్గిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) 106 మిలియన్ డాలర్లు పెరిగి 17.963 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.
ఐఎంఎఫ్లో భారత్ నిల్వలు 23 మిలియన్ల డాలర్లు పెరిగి 4.96 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వలు 145 మిలియన్ల డాలర్లు పెరిగి 38.502 బిలియన్ డాలర్లకు పెరిగాయి.