లక్నో, ఆగస్టు 1: లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్పై లాయర్లు ఫిర్యాదు చేశారు. అయోధ్య రామమందిరం హుండీ చోరీ పేరుతో పార్లమెంట్ ఎదుట వీరు వేసిన ‘స్కిట్’ హిందువుల మనోభావాల్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఆ నాటకం హిందూ ధర్మాన్ని, సన్యాసులను అవమానించే విధంగా ఉందని వారణాసిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. శనివారం వారణాసిలో పలువురు సన్యాసులు, న్యాయవాదులు పప్పు యాదవ్, రాహుల్గాంధీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.