హైదరాబాద్, ఫిబ్రవరి 13: వార్షికంగా ప్రతియేటా 7 శాతం నుంచి 8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటేనే 2047 నాటికి భారత్ అభివృద్ధి దేశంగా అవతరించనున్నదని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు. తలసరి ఆదాయం 13 వేల డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయన్నారు. అసమానతలను లేదా పేదరికాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యల్లో ఆవిష్కరణ ఒక్కటే పరిష్కారం కాదని ఆయన అన్నారు.
ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి ఆదాయం 13 వేల డాలర్ల స్థాయిలో ఉండగా, అదే భారత్లో కేవలం 2,700 డాలర్లుగా ఉన్నదన్నారు. అంటే ప్రస్తుతం ఉన్నదాంతో పోలిస్తే తలసరి ఆదాయం ఐదు రెట్లు పెరగాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. కానీ, ఇదే సమయంలో రూపాయి రేటు తక్కువగా లేదా ఆదాయం మరింత పెరిగితే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్నదన్నారు.