ముంబై, మార్చి 26: గత ఏడాది దేశంలో కొత్తగా 94 మంది డాలర్ బిలియనీర్లు అవతరించారని హురున్ తాజా జాబితాలో తేలింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో మరే దేశంలోనూ పెరగకపోవడం గమనార్హం. దీంతో భారత్లో మొత్తం డాలర్ బిలియనీర్ల సంఖ్య 271కి చేరింది. ఈ క్రమంలోనే దేశంలోని బిలియనీర్ల దగ్గరున్న సంపద విలువ లక్ష కోట్ల డాలర్లపైనేనని మంగళవారం విడుదలైన ‘2024 హురున్ గ్లోబల్ రిచ్ లీస్ట్’ స్పష్టం చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 231 బిలియన్ డాలర్లతో ఉన్నారు. రెండో స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 185 బిలియన్ డాలర్లతో నిలిచారు. భారత్ నుంచి టాప్-10లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ ఉన్నారు. 115 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో స్థిరపడ్డారు. అదానీ గ్రూప్ సారథి గౌతమ్ అదానీ 15వ స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3,279 మంది డాలర్ బీలియనీర్లున్నారు.
అంబానీయే టాప్
2023లో ముకేశ్ అంబానీ సంపద వి లువ గతంతో పోల్చితే ఏకంగా 40 శాతం ఎగిసింది. 2022తో చూస్తే నిరుడు 33 బిలియన్ డాలర్లు పెరిగి 115 బిలియన్ డాలర్లుగా ఉన్నది. దీంతో దేశంతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి ముకేశ్ రికార్డులకెక్కారు. గౌత మ్ అదానీ సంపద కూడా గత ఏడాది 33 బిలియన్ డాలర్లు పెరిగి 86 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక దేశంలోని బిలియనీర్లలో ఒక్క ముంబైలోనే 92 మంది ఉన్నారు. దీంతో ఈ విషయంలో చైనా రాజధాని బీజింగ్ వెనుకబడిపోయింది. అక్కడ 91 మందే ఉన్నారు.
దేశంలో రూ.1,000 కోట్లకుపైగా సంపద ఉన్నవారు 1,319 మంది ఉన్నారు. 1,300 మార్కును దాటడం ఇదే తొలిసారి. 2022తో పోల్చితే 216 మంది పెరిగారు. 2023లోనే తొలిసారి ఈ స్థాయిని అందుకున్నవారు 278 మంది.భారతీయ బిలియనీర్లలో ఔషధ రంగానికి చెందినవారే అత్యధికంగా 39 మంది ఉన్నారు. ఆ తర్వాత ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ రంగానికి చెందినవారు 27 మంది, కెమికల్స్కు చెందినవారు 24 మంది ఉన్నారు.
తెలుగువారు వీళ్లే..
నికర విలువ(బిలియన్ డాలర్లలో)