BOI | న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదాయ పన్ను శాఖ షాకిచ్చింది. రూ.564.44 కో ట్ల జరిమానా విధించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 270 ఏ కింద ఐటీ డిపార్ట్మెంట్ ఈ ఆర్డర్ను జారీ చేసింది.
దీనికి వ్యతిరేకంగా బ్యాంక్ ఐటీ శాఖ కమిషనర్, నేషనల్ ఫేస్లెస్ అప్పిల్ సెంటర్కు వెళ్లనున్నది. 2018-19లో బ్యాంక్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై రూ.564కోట్ల జరిమానా విధించింది.