TMC Abhishek Banerjee | పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విదేశాలకు వెళ్లేందుకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. వైద్య చికిత్స కోసం దుబాయ్కు వెళ్లేందుకు తనతోపాటు తన భార్య రుజిరా బెనర్జీలను అనుమతించాలని అభిషేక్ బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
అంతకుముందు బొగ్గు స్మగ్లింగ్తోపాటు హవాలా లావాదేవీల కేసుల్లో అభిషేక్ బెనర్జీపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతించబోమని తెలిపింది. కంటి వైద్య చికిత్స కోసం దుబాయ్కి వెళ్లేందుకు అనుమతించాలని, తర్వాత కొంత కాలానికి తనను విచారించొచ్చునని ఈడీ అధికారులను అభిషేక్ కోరారు. కానీ ఆయన అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఈడీ.
ఈ నెల మూడో తేదీ నుంచి 10 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని ఈడీకి అభిషేక్ లేఖ రాశారు. కొన్ని శక్తుల కోసం కొందరు న్యాయమూర్తులు పక్షపాత పూరితంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల అభిషేక్ సంచలన వ్యాఖ్యలు చేయశారు. చాలా పెట్టి కేసులపైనా న్యాయస్థానాలు తీర్పులిస్తున్నాయని గత నెల 28న హాల్డియా ఘటన రుజువు చేస్తున్నదన్నారు.