హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ) : ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026ను నిర్వహించనున్నట్టు ఐఐటీ హైదరాబాద్ ప్రకటించింది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, స్టార్టప్లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కూడా హాజరుకాబోతున్నారు.
ఎంఎస్ఎంఈ-ఎస్సీఐపీ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సదస్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడం, పరిశ్రమ-విద్యా భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడం, పరిశోధన సంస్థల నుండి ఉద్భవిస్తున్న అత్యాధునిక ఆవిషరణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తిగలవారు https://tto.iith.ac.in/ events/msme-tech-connect వెబ్సైట్ ద్వారా సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.