న్యూఢిల్లీ, మే 4: ఐడీబీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,628 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.1,133 కోట్ల లాభం కంటే 44 శాతం అధికం. అలాగే బ్యాంక్ రూ.7,887 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.