న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తన ఆర్థిక ఫలితాలు అదరగొట్టింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.6,905 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.4,616 కోట్ల లాభంతో పోలిస్తే 50 శాతం ఎగబాకినట్లు తెలిపింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.24,379.27 కోట్ల నుంచి రూ.28,336.74 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. కన్సాలిడేటెడ్ ఆదారంగా రూ.23,671.54 కోట్ల ఆదాయంపై రూ.7,385 కోట్ల లాభాన్ని గడించింది.