IBM Ultimatum : ఇప్పటికీ రిమోట్ వర్కింగ్లో ఉన్న మేనేజర్లకు ఐబీఎం గట్టి వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ సమీపంలో నివసించాలని లేదా సంస్ధ నుంచి వైదొలగాలని అల్టిమేటం జారీ చేసింది. వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయంలో లేదా క్లైంట్ లొకేషన్లో తక్షణమే రిపోర్ట్ చేయాలని అమెరికా కేంద్రంగా కంపెనీలో పనిచేసే మేనేజర్లందరినీ ఐబీఎం హెచ్చరించింది.
వైద్యపరమైన కారణాలతో రిమోట్ వర్క్ మినహాయింపు పొందుతున్న వారు ఆగస్ట్ నాటికి ఐబీఎం కార్యాలయాల సమీపానికి రీలొకేట్ కావాలని కోరింది. ఐబీఎం కార్యాలయాలకు దగ్గరగా చేరుకోని వారు, రిమోట్ అప్రూవ్ కలిగిన ఉద్యోగాల్లో లేని వారు ఐబీఎం నుంచి నిష్క్రమించవచ్చని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ గ్రాంగర్ పేర్కొన్నారు. ముఖాముఖి సంప్రదింపులు, వెసులుబాటు మధ్య సమతూకం పాటించే పని వాతావరణం కల్పించే దిశగా ఐబీఎం దృష్టి సారిస్తుందని కంపెనీ ప్రతినిధి చెప్పారు.
ఎగ్జిక్యూటివ్లు, మేనేజర్లు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయాల్లో పనిచేయాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇక ఐబీఎం సీఈవో అర్వింద్ కృష్ణ కార్యాలయంలో పనిచేయడం అవసరాన్ని గతంలో పలుమార్లు నొక్కిచెప్పారు. ఆన్ సైట్లో పనిచేయని వారికి పదోన్నతులు దక్కడం అరుదని బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.
Read More :
London Train: లండన్ మెట్రోరైలులో పంచ్లు విసురుకున్న ప్యాసింజెర్లు.. వీడియో