‘మధ్యతరగతి కుటుంబం నుంచే నేనూ వచ్చా. వాళ్ల బాధలు, కష్టాలు నాకూ తెలుసు’ ఇవీ..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈమధ్య అన్న మాటలు.
కానీ ప్రతిసారీ బడ్జెట్ ముందు ఆశపడటం, ఆ తర్వాత నిరాశలో మునిగిపోవడం కామన్ మ్యాన్కు చాలా కామనైపోయింది. ఉన్న ఐదేండ్లలో ఒక్కోసారి ఒక్కో రంగానికి ఏదో చేశామని చెప్పి చివరకు ప్రతిసారీ సామాన్యుడికి సున్నం రాయడం దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం.
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?.. ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి దేశ ప్రజానీకం
ఏం కోరుకుంటున్నదో చూద్దాం.
ఎన్నికలకు వెళ్లే ముందు ఇదే పూర్తిస్థాయి తుది బడ్జెట్. అందుకే ఏం చేయాలన్నా ఈసారే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం ధరాఘాతం ప్రతి ఒక్కరినీ కుదేలు చేస్తోంది. ఉప్పు, పప్పు, బియ్యం, నూనెలు, కూరగాయలు, పండ్లు, వాహనాలు, ఇంధన ధరలు, గ్యాస్, ప్రయాణ ఛార్జీలు, ఎలక్ట్రిక్-ఎలక్ట్రానిక్ ఉపకరణాలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ ఆగేదే కాదు. దీనికితోడు రుణాలపై వడ్డీరేట్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఈఎంఐ భారం పెరిగి చిరుద్యోగి కూడా చిక్కుల్లోపడ్డాడు. మరోవైపు గోరు చుట్టుపై రోకలి పోటులా ఇప్పుడు మాంద్యం భయాలు వెంటాతున్నాయి. భారీగా ఉద్యోగాలూ పోతున్నాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ప్రజలు బడ్జెట్ నుంచి ఎంతోకొంత ఉపశమనాన్ని ఆశిస్తారు. మరి తానూ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని చెప్పుకుంటున్న నిర్మలా సీతారామన్ ఈసారి ఏం చేస్తారో చూడాలి.
ఇదో బ్రహ్మపదార్థం. సామాన్యుడికి ఎప్పటికీ కొరుకుడుపడని ఓ రాకెట్ సైన్స్. ఈపీఎఫ్, ఎన్పీఎస్, హౌసింగ్ లోన్ అసలు, వడ్డీలతోపాటు, ఈఎల్ఎస్ఎస్, మెడికల్ ఇన్సూరెన్స్, ట్యూషన్ ఫీజులు.. ఇలా ఎన్నో లింకు లు, సబ్ లింకులతో తామరతంపరగా ఉం టుంది ఈ సెక్షన్. పైన చెప్పిన వాటిల్లో ఏటా రూ.1.5 లక్షల వరకు మన ట్యాక్సబుల్ ఆదాయం నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ లెక్కన వివిధ శ్లాబుల్లో ఉన్నవారికి కనిష్ఠంగా రూ.15 వేల నుంచి గరిష్ఠంగా రూ.45 వేలదాకా లబ్ధి చేకూరుతుంది. అయితే ఇది ఎప్పటిదో పాత విధానం కావడంతో దీన్ని మార్పులు చేర్పులు చేయడానికి గత బడ్జెట్లో ఒక విధానం తీసుకువచ్చారు. దీని కింద గరిష్ఠంగా రూ.5 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ పైన ఆదాయం ఉంటే మాత్రం పన్ను చెల్లించాలి. కానీ గరిష్ఠ ఆదాయం శ్లాబుల్లో ఉన్నవాళ్లకు పాత విధానంలోనే కాస్త ఆదా అవుతుంది.
సెక్షన్ 80సీ కింద ఉన్న రూ.1.5 లక్షల పన్ను మినహాయింపును కనీసం రెట్టింపు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నది. ఏడేండ్ల క్రితం దీన్ని రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు. అప్పట్నుంచి ఎలాంటి మార్పూ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని రూ.3 లక్షలకైనా పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. అలాగే మాంద్యం కారణంగా అంతటా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. దీంతో బాధితులకు ఏదైనా మెయింటెనెన్స్ కోసం కొద్దిమొత్తాన్ని ఇవ్వాలనే ప్రతిపాదన కూడా వస్తున్నది.
ఇప్పుడున్న పన్ను విధానాన్ని సరళతరం చేయాలన్న డిమాండ్ కూడా ఉన్నది. సెక్షన్ 80సీలోనే 80సీసీసీ, 80సీసీసీ(1), 80సీసీసీ(1బి), 80సీసీసీ(2), 80డీలతోపాటు రకరకాల ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉన్నా యి. ఎల్ఐసీ, పోస్టాఫీస్ బాండ్లు, ఈఎల్ఎస్ఎస్, విరాళాలు, సుకన్య సమృద్ధి, నేషనల్ పెన్షన్ స్కీమ్.. ఇలా ఎన్నో ఉన్నాయి. హౌజింగ్ లోన్ అసలు, వడ్డీలను కూడా అధిక శాతం మంది పెట్టుబడి సాధనాలుగా వాడుకుంటారు. అయితే వీటిల్లో సులువైన పన్ను విధానం కావాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ఉన్నది. ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో కూడా గందరగోళం లేకుండా సులువైన పద్ధతులు ఉండాలని కోరుతున్నారు. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ రూపకల్పన, నిర్వహణ, ఫైలింగ్ విషయంలో గత ఏడాది పన్ను చెల్లింపుదారులు పడిన పాట్లు చూస్తేనే అర్థమవుతుంది ప్రభుత్వానికి ఈ అంశంలో ఎంతటి స్పష్టత ఉందో అని.
సెక్షన్ 80సీ కాకుండా ప్రతీ పన్ను చెల్లింపుదారుడు గరిష్ఠంగా తమ ఇద్దరు పిల్లలకు స్కూల్ ట్యూషన్ ఫీజుల కింద కొద్దిగా మినహాయింపును పొందవచ్చు. అయితే ఒక విద్యార్థికి నెలకు రూ.100 చొప్పున ఏడాదికి రూ.1,200లే. ఇద్దరు పిల్లలకూ కలిపి ఇది రూ.2,400 అవుతుంది. ఇక హాస్టల్ ఫీజు కింద నెలకు రూ.300 వరకూ ఒక్కో విద్యార్థికి మినహాయింపు పొందవచ్చు. దీంతో ఇద్దరిపైనా మరో రూ.7,200ల మేర పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇలా మొత్తం రూ.9,600 మినహాయించుకోవచ్చు. కానీ ఈ ఫీజులు 20-25 ఏండ్ల కిందట కూడా ఎక్కడా ఉండకపోవచ్చు. ఏడాదికి కనీసం 10 శాతం చొప్పున పెరుగుతున్న ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ కాలంలో ఈ మినహాయింపులు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. కాబట్టి ఈ మినహాయింపులను పెంచాలని అంతా కోరుతున్నారు. ఈ పద్దులోనైనా కరుణిస్తారా!
‘మధ్యతరగతి కుటుంబం నుంచే నేనూ వచ్చా. వాళ్ల బాధలు, కష్టాలు నాకూ తెలుసు’ ఇవీ..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈమధ్య అన్న మాటలు.
కానీ ప్రతిసారీ బడ్జెట్ ముందు ఆశపడటం, ఆ తర్వాత నిరాశలో మునిగిపోవడం కామన్ మ్యాన్కు చాలా కామనైపోయింది. ఉన్న ఐదేండ్లలో ఒక్కోసారి ఒక్కో రంగానికి ఏదో చేశామని చెప్పి చివరకు ప్రతిసారీ సామాన్యుడికి సున్నం రాయడం దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం.
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?.. ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి దేశ ప్రజానీకం
ఏం కోరుకుంటున్నదో చూద్దాం.
ఇక కరోనా తర్వాత వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. చిన్నచిన్న టెస్టులకు కూడా వేలకువేలు ఖర్చవుతున్న రోజులివి. అయితే కుటుంబం కోసం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్కు గరిష్ఠంగా రూ.25 వేల వరకే డిడక్షన్ ఉన్నది. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద రూ.5 వేలు, సొంతంగా దవాఖాన వైద్య ఖర్చులకు రూ.20 వేల వరకూ మాత్రమే మినహాయింపు ఉన్నది. దీంతో వీటిని రెట్టింపు చేయాలని కోరుతున్నారు.
– నాగేంద్ర సాయి కుందవరం
ప్రస్తుతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విషయంలో చాలా గందరగోళం నెలకొన్నది. ఇండ్లు, స్థలాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, అన్లిస్టెడ్ షేర్లు, బాండ్లు.. ఇలా అనేకం ఉన్నాయి. నిజానికి ఇప్పుడు స్టాక్ మార్కెట్పై జనాల్లో ఆసక్తి కూడా ఎక్కువే. ఈ సమయంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విషయంలో కేంద్రం కొద్దిగా చొరవ తీసుకుని సరళతరం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు స్టాక్స్ విషయంలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కోసం ఉన్న ఏడాది కాలపరిమితిని మరింతగా పెంచుతారనే భయం ఉన్నది. ఇదే జరిగితే స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం పడే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం.
ప్రధాని ఆవాస్ యోజన వంటి పథకాలున్నా.. సామాన్యులు, మధ్యతరగతి జనాలకు మాత్రం అవన్నీ ఎప్పటికీ అందని ద్రాక్షే. ఇక గృహ రుణాలపై వడ్డీరేట్లు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. కరోనా నుంచి తేరుకునేలోపే స్థిరాస్తుల రేట్లు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితుల్లో సొంతింటి కల సాకారం కష్టతరమైపోయింది. దీంతో ఈ బడ్జెట్లోనైనా కేంద్రం తమ కోసం ప్రోత్సాహకాలు ప్రకటించి తీరాల్సిందేనన్న డిమాండ్ ఈ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. వడ్డీ రీయింబర్స్మెంట్తో రాయితీలను పెంచాల్సి ఉన్నది. ప్రస్తుతం అసలు రుణంపై గరిష్ఠంగా రూ.2 లక్షలు, వడ్డీపై రూ.1.5 లక్షలకు మినహాయింపునిస్తున్నారు. వీటిని రెట్టింపు చేస్తేనే సామాన్యులకు ప్రయోజనం ఉన్నది. అలాగే సిమెంట్, స్టీల్సహా ఇతర బిల్డింగ్ మెటీరియల్స్పై జీఎస్టీని తగ్గించాలన్న ఆకాంక్ష కూడా వ్యక్తమవుతున్నది.