హైదరాబాద్, మార్చి 31 : హైదరాబాద్-భోపాల్ మధ్య కొత్త విమాన సర్వీసును ప్రారంభించినట్టు ఫ్లై బిగ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. భోపాల్లోని రాజభోజ్ ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రతిరోజూ సర్వీసు అందుబాటులో ఉంటుందని కంపెనీ సీఎండీ సంజయ్ మాండవీయ తెలిపారు. దేశీయంగా ద్వి, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించడంతోపాటు అన్నివర్గాల ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులో తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. అందుకే విమాన టిక్కెట్టు ప్రారంభ ధరను రూ.2,999గా నిర్ణయించామని పేర్కొన్నారు.