Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): దక్షిణాదిలో గృహ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగ్గా అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. బెంగళూరు, చైన్నై వంటి నగరాల కంటే గరిష్ఠ విక్రయాలను నమోదుచేసి హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచిందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ ప్రాప్ టైగర్ డాట్కామ్ తాజా నివేదికలో వెల్లడించింది. బెంగళూరు 30,470 యూనిట్ల గృహ విక్రయాలు జరుగగా, చెన్నైలో 14,100 యూనిట్లు, హైదరాబాద్లో గరిష్ఠస్థాయిలో 35,372 యూనిట్ల విక్రయాలను నమోదు చేసినట్లు ప్రాప్ టైగర్ తెలిపింది.
ముడి ఉత్పత్తుల వ్యయం అధికం కావడంతో గృహాల ధరలు ప్రతియేటా 4 శాతం పెరిగినప్పటికీ విక్రయాల డిమాండ్ మాత్రం ఊపందుకుంటుందని పేర్కొంది. 2021(జనవరి-డిసెంబర్)లో హైదరాబాద్లో నమోదైన గృహ విక్రయాల యూనిట్లు 22,239 ఉంటే.. 2022(జనవరి-డిసెంబర్)లో యూనిట్ల సంఖ్య 50 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది.