న్యూఢిల్లీ, మార్చి 31: రాష్ర్టాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంగా కేంద్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లను విడుదల చేసింది. మార్చి 27న విడుదలైన ఈ పరిహారం వివరాలను తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో తెలంగాణకు రూ.770.58 కోట్లు వచ్చా యి. ఇక బుధవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో మొత్తం రూ.70వేల కోట్లను విడుదల చేయగా, దాదాపు రూ.63వేల కోట్లు ఇంకా రావాల్సి ఉన్నది. ఇదిలావుంటే తాత్కాలిక ఐజీఎస్టీ పరిష్కారం కింద మంగళవారం రాష్ర్టాలకు మరో రూ.14వేల కోట్లనూ విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.563 కోట్లు వచ్చాయి.
ఇవీ కూడా చదవండి
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు