హైదరాబాద్, సెప్టెంబర్ 2: హైదరాబాద్కు చెందిన ఏరోస్పెస్ స్టార్టప్ స్కైరూట్ ఏకంగా రూ.403 కోట్ల(51 మిలియన్ డాలర్ల) నిధులను సమీకరించింది. సిరీస్-బీ ఫండింగ్లో భాగంగా ఈ నిధులను సింగపూర్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న జీఐసీ నుంచి సేకరించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇంజినీరింగ్ ఉద్యోగులను పెంచుకోవడానికి, ఈ ఏడాది చివర్లో కమర్షియల్ శాటిలైట్ను ప్రారంభించబోతున్న సంస్థకు ఈ నిధులు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయని స్కైరూట్ ఫౌండర్ పవన్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 200 మంది ఇంజినీరింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది ఈ సంఖ్యను పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. దేశీయ అంతరిక్ష సాంకేతిక రంగంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులను సేకరించిన సంస్థగా రికార్డు సృష్టించింది. 2021లో సంస్థ సిరీస్-ఏ ఫండింగ్లో భాగంగా 11 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడులు పూర్తైన తర్వాత జీఐసీ ఇండియా డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు ఎండీ మయాంక్ రావత్.. స్కైరూట్ బోర్డులోకి చేరనున్నారు.