న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఫోక్స్వ్యాగన్..ఎస్యూవీ మాడల్ టైగూన్ ధరను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. స్వల్పకాలంపాటు ఈ ధరలు అమలులో ఉండనున్నాయని పేర్కొంది. దీంతో 1.0లీటర్ ఎంటీ రకం రూ.11.70 లక్షల నుంచి రూ.11 లక్షలకు ధరను తగ్గించింది.
అలాగే జీటీ ప్లస్ ధరను రూ.75 వేలు, జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్జీ మాడల్ ధరను రూ.1.05 లక్షలు కోత పెట్టింది. దీంతో కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.18.90 లక్షల మధ్యలోకి చేరుకున్నది. ఈ నెలలోనే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మాడళ్లను ధరలను తగ్గించినది తెలిసిందే.