న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ హానర్ (Honor) బ్రాండ్ న్యూ ఫోన్తో మళ్లీ భారత్ మార్కెట్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనుంది. రాబోయే మాసాల్లో హానర్ 90 భారత్లో లాంఛ్ కానుందని ప్రముఖ టెక్ యూట్యూబర్ వెల్లడించారు. ఈ ఫోన్ ఇప్పటికే ఇతర మార్కెట్లలో లాంఛ్ కాగా సెప్టెంబర్లో భారత్లో ఎంట్రీ ఇవ్వనుంది. హానర్ 90 భారత్లో సెప్టెంబర్లో లాంఛ్ కానుందని టెక్నికల్ గురూజీగా పేరొందిన గౌరవ్ చౌధరి వెల్లడించారు.
భారత్లో ఈ స్మార్ట్ఫోన్ ధర ఎంత ఉంటుందనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. గ్లోబల్ మార్కెట్లో ఈ హాట్ డివైజ్ పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్లో అందుబాటులో ఉండగా ఎమరాల్డ్ గ్రీన్ వేరియంట్ భారత్లోనూ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 200 ఎంపీ కెమెరా హానర్ 90 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇక లాంఛ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ ఇతర కీలక స్పెసిఫికేషన్స్ వెలుగుచూస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హానర్ భారత్కు తిరిగివస్తున్న క్రమంలో రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేథ్ హానర్ ఇండియా చీఫ్గా బాధ్యతలు చేపడతారని తెలిసింది. టాప్ ఎగ్జిక్యూటివ్స్తో కలిసి 15 మంది ఉద్యోగులు రియల్మీని వీడి ఇప్పటికే హానర్టెక్లో చేరడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
Read More :