న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ కార్లు, బైక్లను మార్కెట్లోకి తీసుకురాగా.. ఇప్పుడు హోండా సంస్థ కూడా తమ ఇ-స్కూటర్ యు-గో (Honda e-scooter) ను విడుదల చేసింది. ప్రస్తుతానికి వీటిని చైనా మార్కెట్లోనే లాంచ్ చేయగా, త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇవి చైనాలోని వుయాంగ్ హోండా యూనిట్లో తయారవుతున్నాయి. ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. చైనాలో వీటి ప్రారంభ ధర దాదాపు రూ.85,342 గా, స్టాండర్డ్ మోడల్ 1.2 కేడబ్ల్యూ ధర దాదాపు రూ.91,501 గా ఉండనున్నది. చైనీస్ మార్కెట్లో ఇతర ఇ-స్కూటర్ల కంటే తక్కువ ధరకే యు-గో దొరుకుతున్నాయి. భారతదేశంలో ఇవి ఓలా ఇ-స్కూటర్తో పోటీపడనున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఈ ఇ-స్కూటర్లో ఎల్సీడీ స్క్రీన్ ఉండి.. స్పీడ్, డిస్టెన్స్, ఛార్జ్, రైడింగ్ మోడ్ వంటి సమాచారం అందుతుంది. ఫ్రంట్ ఆప్రాన్లో ట్రిపుల్ బీమ్తో ఎల్ఈడీ హెడ్లైట్ను కలిగా ఉన్నది. ఎల్ఈడీ డీఆర్ఎల్స్ స్ట్రిప్ను కూడా కలిగి ఉన్నది. 12 ఇంచుల ముందు, 10-అంగుళాల వెనుక అల్లాయ్ వీల్స్తో 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది.
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..