దేశీయ బ్యాంకింగ్ రంగానికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.50 లక్షల కోట్ల మేర లాభాలు ఆర్జించవచ్చును. దేశ ఆర్థిక పరిస్థితులు కోలుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ.68,500 కోట్ల లాభాలను ఆర్జించిన పీఎస్బీలు మిగతా ఆరు నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆర్జించవచ్చునని పేర్కొంది.
రుణాలకు డిమాండ్ పెరగడం, నిరర్థక ఆస్తులు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎస్బీలు రూ.1.04 లక్షల కోట్ల మేర లాభాలను ఆర్జించిన విషయం తెలిసిందే. ఎన్పీఏలు తగ్గుముఖం పట్టడం, రుణాలకు డిమాండ్, అధిక వడ్డీరేటు కారణంగా వచ్చే త్రైమాసికాల్లో బ్యాంకులు లాభాలు మరింత పెరగడానికి దోహదం చేయవచ్చునని పేర్కొంది.