న్యూఢిల్లీ, మార్చి 22: హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల ధరలు పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి దాదాపు 2 శాతం పెరుగుతున్నట్టు బుధవారం ఆ సంస్థ తెలియజేసింది. భారంగా మారిన ఉత్పాదక వ్యయం వల్లే ధరల్ని పెంచుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి వివిధ రకాల హీరో మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెరుగబోతున్నాయి.
కాగా, ఓబీడీ-2 (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్) మార్పు కారణంగానే వాహన తయారీ ఖర్చు పెరుగుతున్నది. వచ్చే నెల మొదలు వాహనాల్లో రియల్-టైం డ్రైవింగ్ ఎమిషన్ లెవల్స్ పరిశీలనకు ఆన్-బోర్డ్ సెల్ఫ్-డయాగ్నోస్టిక్ డివైజ్లు ఉండాల్సిందేనన్న నిబంధన అమల్లోకి వస్తున్నది.