ఆర్కేపురం, జూన్ 29 : టీఆర్ఎస్ నాయకుడు అబేద్ కుటుంబానికి అండగా ఉంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ అబేద్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. అబేద్ కుటుంబ సభ్యులు కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకున్న బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్ అబేద్ కుటుంబ సభ్యులను మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటికి తీసుకెళ్లి పరిస్థితిని మంత్రికి వివరించారు. అందుకు స్పందించిన మంత్రి మాట్లాడుతూ అబేద్ పెద్ద కూతురుకు ఔట్ సోర్సింగ్లో ఉద్యోగం కల్పిస్తామన్నారు. మిగతా ఇద్దరు కూతుర్లను కూడా మంచి పాఠశాలలో చదివిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లెల కృష్ణారెడ్డి, జహీర్, వెంకట్గౌడ్, సలీం, గోవర్ధన్రెడ్డి, యశ్వంత్రెడ్డి ఉన్నారు.
మహేశ్వరం,జూన్ 29 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆసరాలాంటిదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన బాలం విజయకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో సీఎం రిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకోగా ఆమెకు రూ. 32,500 వేల చెక్కు మంజూరు అయ్యింది. ఆ చెక్కును నగరంలోని మంత్రి నివాసంలో ఆమెకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల యువజన నాయకులు శ్రీను పాల్గొన్నారు.