హైదరాబాద్, ఫిబ్రవరి 7: రిజర్వుబ్యాంక్ తన తదుపరి పరపతి సమీక్షకంటే ముందుగానే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెరిగిన వడ్డీరేట్లు వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది. దీంతో నెలవారి చెల్లింపులు మరింత అధికంకానున్నాయి. నెలరోజుల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.60 శాతానికి, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 8.65 శాతం, 8.75 శాతానికి చేరుకోనున్నది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీ 8.85 శాతం నుంచి 8.90 శాతానికి చేరుకోనుండగా….రెండేండ్ల రుణాలపై వడ్డీ 9 శాతంగాను, మూడేండ్ల రుణాలపై రేటు 9.10 శాతానికి పెంచింది.