Hardeep Puri : వచ్చే ఆర్ధిక సంవత్సరం 2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ దశాబ్ధి చివరి నాటికి ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్ధీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్ధ 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
మనకు శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని, ఇప్పుడు మనం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్నామని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదని ఆయన వెల్లడించారు. రాబోయే రెండేండ్లలో మనం మరింత ముందుకెళతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ పది ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ మార్కెట్, ఎనర్జీ, బయో ఇంధనాలు సహా పలు రంగాల్లో ప్రపంచ పెట్టుబడిదారులు భారత్ వైపు చూస్తున్నారని వివరించారు. 2023-24 ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత్ 7.3 శాతం వృద్ధి రేటు కనబరుస్తుందని అన్నారు.
Read More :