GST Council Meet | చిన్న వ్యాపారులకు మేలు చేసేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకున్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. త్వరలో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జీఎస్టీపై ట్రిబునళ్లు, కోర్టుకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ మీడియాకు చెప్పారు. అలాగే వ్యాపారులు జరిమానా చెల్లించడంలో ఆలస్యమైతే, దానిపైన వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని, దీన్ని ఎత్తేయాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్నారు.
ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్ విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రత్యేకించి, ఇన్ పుట్ క్రెడిట్ టాక్స్ విషయంలో మోసాలు జరుగకుండా ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి అమలు చేయాలని నిర్ణయించాం అని తెలిపారు. అన్ని రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 12 శాతానికి కుదించడం ద్వారా ఆపిల్, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. స్ప్రింకర్లు, సోలార్ కుక్కర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 73 నిబంధన కింద విధించే జరిమానాలపై ప్రధానంగా చర్చించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
గతేడాది అక్టోబర్ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగడం ఇదే తొలిసారి అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వల్ల చాలా కాలం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపారు. శనివారం చర్చించిన అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత మరోమారు చర్చిస్తాం జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై ఈ రోజు చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Bajaj CNG Bike | వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ మార్కెట్లోకి వచ్చేస్తోంది.. ముహూర్తం ఎప్పుడంటే..?!
Infinix Note 40 5G | 108 మెగా పిక్సెల్ కెమెరాతో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ.. ధరెంతో తెలుసా..?!
Oppo A3 Pro | ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!