Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 676 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకుపైగా పెరిగింది. దీపావళి నాటికి జీఎస్టీ వ్యవస్థను మారుస్తామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో ఆటోమొబైల్తో పాటు పలు కంపెనీల షేర్లలో భారీగా కొనుగోళ్లకు దారి తీసింది. బెంచ్మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒక శాతం వరకు లాభాలను నమోదు చేశాయి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ భారతదేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడం కూడా మార్కెట్పై సానుకూల ప్రభావాన్ని చూపిందని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,315.79 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత ఇంట్రాడేలో 81,202.42 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 81,765.77 పాయింట్లకు పెరిగింది. చివరకు 676.09 పాయింట్ల లాభంతో 81,273.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 251.20 పెరిగి 24,882.50 వద్ద స్థిరపడింది.
దాదాపు 2446 షేర్లు లాభపడ్డాయి. 1,555 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో మారుతి సుజుకి, నెస్లే, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో అత్యధికంగా లాభపడ్డాయి. ఐటీసీ, టెక్ మహీంద్రా, ఎటర్నల్, ఎల్ అండ్ డీ, ఎ న్టీపీసీ నష్టపోయాయి. ఐటీ, మీడియా, విద్యుత్ మినహా మిగతా అన్ని రంగాలు ఆటో ఇండెక్స్ 4 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ 3 శాతం, రియాలిటీ 2 శాతం, మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం, ప్రైవేట్ బ్యాంక్ ఒకటి నుంచి 2 శాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పెరిగాయి. ఆటో షేర్లకు మంచి డిమాండ్ కనిపించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా స్టాక్ 8.45 శాతం పెరిగింది. బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 4.26 శాతం పెరిగి 56,233.33కి చేరుకుంది. జపాన్కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్, షాంఘైకి చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్ సానుకూలంగా ముగిశాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ నష్టపోయింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.62 శాతం పెరిగి బ్యారెల్కు 66.25 డాలర్లకు చేరుకుంది.