Onion Rates | బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డల ధరలను తగ్గించడానికి కేంద్రం తగు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఢిల్లీ, గువాహటి వంటి కొన్ని నగరాల్లో బహిరంగ మార్కెట్లోకి 50 వేల టన్నుల ఉల్లిగడ్డ నిల్వలను విడుదల చేయనున్నది. ఉత్తరాది మార్కెట్లలో దేశంలోనే సగటు కంటే ఎక్కువ ధరలు ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. అవసరమైనప్పుడు బహిరంగ మార్కెట్లోకి 2.5 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు నిల్వలను కొనసాగిస్తోంది.
కేంద్ర వినియోగదారుల వ్యవహరాల విభాగం నేరుగా బహిరంగ మార్కెట్లో 50 వేల టన్నుల ఉల్లిగడ్డలు విక్రయిస్తుంది. మంగళవారం దేశంలోని వివిధ మార్కెట్లో సగటు ఉల్లిగడ్డ ధర రూ.26 పలికింది. కేంద్రం రూ.18లకే కిలో ఉల్లిగడ్డ విక్రయిస్తున్నది.
2020-21లో 266.41 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు దిగుబడి వచ్చింది. 160.50 లక్షల టన్నుల ఉల్లిగడ్డలు వాడకం అయ్యాయి. రబీ, ఖరీఫ్ సీజన్ల మధ్య తేడాతో సెప్టెంబర్-డిసెంబర్ నెలల్లో ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుంటాయి. కానీ పంట పొలాల్లో చీడపీడలు, తేమశాతం ఎక్కువ కావడంతో దిగుబడి తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.