Toll Plaza | టోల్ ప్లాజా`ల వద్ద సంబంధిత వాహనం నంబర్ ప్లేట్..`ఆటోమేటిక్ రికగ్నిషన్`తో టోల్ ఫీజు చెల్లింపు విధానం అమల్లోకి తేనున్నది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నామని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం చెప్పారు. వెహికల్ నంబర్ ప్లేట్ `ఆటోమేటిక్ రికగ్నిషన్` పాలసీ సక్సెస్ అయితే టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ తగ్గిపోతుంది. టోల్ ఫీజు వర్తించే రహదారులపై సంబంధిత వాహనం ప్రయాణించిన దూరానికే ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) నిర్వహించిన ఒక సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. వాహనాల నంబర్ ప్లేట్ను రీడ్ చేసే కెమెరాలను టోల్ ప్లాజా వద్ద ఇన్స్టలేషన్ చేస్తారు. సంబంధిత నంబర్ ప్లేట్ను గుర్తించగానే ఎంత టోల్ ఫీజు చెల్లించాలో నిర్ధారిస్తుంది. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ నిలపాల్సిన అవసరం లేదు. నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరాతో ఖరారైన టోల్ ఫీజు.. సంబంధిత వాహన యజమాని ఖాతా నుంచి ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. ఈ టెక్నాలజీతో ట్రాఫిక్ నివారించడంతోపాటు వాహనం తిరిగినంత మేరకే ఫీజు చెల్లించే విధానం అమల్లోకి వస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు.