న్యూఢిల్లీ : ఇంధన ధరలు సెగలు రేపుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ కలిసిన పెట్రోల్(ఈబీపీ) కార్యక్రమం కింద ఇథనాల్పై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించింది. ఇథనాల్ ధరలు దిగిరావడంతో ఎగబాకుతున్న ఇంధన ధరలను కొంతమేర కట్టడి చేయవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు ఇథనాల్ కలిసిన పెట్రోల్ ఉత్పత్తులను పెంచేందుకూ కేంద్రం కసరత్తు సాగిస్తోంది.
ఈబీపీ కార్యక్రమం కింద చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇథనాల్ కలిపిన పెట్రోల్ను ప్రోత్సాహకరంగా విక్రయించాయి. ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్ధాన్ పెట్రోలియంలు గత ఏడాది 3672 కోట్ల లీటర్ల ఈబీపీని విక్రయించాయి. ఈబీపీ ద్వారా పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా చమురు దిగుమతులు తగ్గడం ద్వారా పెద్దమొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇక 2025 నుంచి భారత్లో 20 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్నే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.