దేశవ్యాప్తంగా కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీని సులభతరం చేసేందుకు వీలుగా ఈ కొత్త ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్) తో (Bharath Registration) రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఈ కొత్త రకం ప్రక్రియతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. మరో రాష్ట్రానికి బదిలీ అయి వెళ్లగానే వారి వాహనాలకు అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేశారు. అంటే.. బీహెచ్ సిరీస్తో రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు నేషనల్పర్మిట్ లభిస్తున్నదన్నమాట. సెంట్రల్ మోటార్ వాహనాల (20 వ సవరణ) నియమాలు, 2021, చట్టం 2021 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. బీహెచ్- సిరీస్ వాహనం కోసం రిజిస్ట్రేషన్ మార్క్ పోర్టల్ ద్వారా రాండమ్గా ఉత్పత్తి అవుతుంది.
భారత్ సిరీస్ ప్రక్రియకు మూడు రోజుల క్రితం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్ చేసే వాహనాలు అన్నింటికీ బీహెచ్ సిరీస్ వర్తించనున్నది. ఇప్పటివరకు మోటార్ వెహికిల్ చట్టం, 1988 ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాన్ని మరో రాష్ట్రానికి తీసుకెళ్లిన తర్వాత ఏడాదిలోగా అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వాహనం యజమానికి ఎన్ఓసీ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ ఆఫీసు చుట్టూ తిరగడం, పన్నులు చెల్లించడం వంటి తలనొప్పులు ఉండేవి. అయితే, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన విధానంతో.. రాష్ట్రం మారేవారు వారి వాహనానికి స్థానికంగా తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త ప్రక్రియలో వాహనానికి ‘YY BH 1234 XX’ మాదిరిగా రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీనిలో తొలి రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరాన్ని, తర్వాత బీహెచ్ అంటే భారత్ సిరీస్ను.. తర్వాత నాలుగు అంకెలతో వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. చివరన ఉండే రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రాన్ని సూచిస్తాయి.
భారత్ సిరీస్లో వాహనాల రిజిస్ట్రేషన్ సౌకర్యం రక్షణ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర / రాష్ట్ర పీఎస్యులు, ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థలకు స్వచ్ఛందంగా ఇవ్వనున్నారు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలు, ఆయా సంస్థల ఉద్యోగులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
బీహెచ్ సిరీస్ వాహనాలు ఒకేసారి రెండేండ్ల పాటు రోడ్డు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. పద్నాలుగేండ్లు పూర్తయిన తర్వాత ఏటా రోడ్డు పన్ను విధిస్తారు. ముందుగా చెల్లించే పన్ను మొత్తంలో సగం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త విధానంలో పన్నుల చెల్లింపుల్లో కేంద్రం, రాష్ట్రాల వాటాల మధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
పెండ్లి పందిరిలో పుషప్స్.. వావ్ గ్రేట్!
మోడెర్నా వ్యాక్సిన్తో ఇద్దరు మృతి
కొవిడ్ మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు పొడగింపు
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్ఓ అభినందన
అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..