న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ నూతన చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభు త్వం నియమించింది. గత నెలలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) ఎల్ఐసీ చైర్మన్గా సిద్ధార్థను సిఫారస్ చేసింది. ఆయన ఈ పదవిలో జూన్ 7, 2025 వరకు ఉండనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సమావేశమై ఈ నియామకానికి పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం మొహంతి..ఎల్ఐసీ ఎండీగా ఉన్నారు. మరోవైపు, ఎల్ఐసీ మాజీ ఎండీ బీసీ పట్నాయక్..ఐఆర్డీఏఐ సభ్యుడుగా నియమితులయ్యారు.