Air India | ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఆధీనం నుంచి టాటా సన్స్కు అప్పగించిన ఎయిరిండియా రుణ బకాయిల సెటిల్మెంట్కు చర్యలు చేపట్టింది. ఎయిరిండియా రుణ బకాయిలను చెల్లించడానికి రూ.51,971 కోట్ల మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో అదనపు కేటాయింపులు చేశారు. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కింద ఈ రుణాలను బదిలీ చేస్తుంది. ఈ రూ.51,971 కోట్ల నిధులు.. 2021-22లో మొత్తం ఖర్చులపై సవరించిన అంచనాల ప్రకారం కేటాయించింది.
నష్టాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లకు టాటా సన్స్కు అప్పగించింది. ఇందులో రూ.2,700 కోట్లు నేరుగా ప్రభుత్వ ఖజానాకు టాటా సన్స్ చెల్లించింది. మిగతా రూ.15,300 కోట్ల రుణాలను సంబంధిత బ్యాంకులకు చెల్లిస్తుంది.
వేటీకరణకు ముందు.. ప్రైవేటీకరణ తర్వాత ఎయిరిండియా నష్టాల్లో చిక్కుకుందని కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. 69 ఏండ్ల క్రితం ప్రైవేట్ రంగంలో ఉన్న ఎయిరిండియాను జాతీయకరణ చేయడమే మిస్టేక్ అని అన్నారు. ఆ పొరపాటును తమ ప్రభుత్వం సరి చేస్తుందని తెలిపారు.