న్యూఢిల్లీ: జియోతో టెలికం రంగంలోనే సంచలనం స్రుష్టించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. దేశీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్నే సొంతం చేసుకోవాలని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. అందుకోసం సెర్చింజన్ గూగుల్ సాయంతో స్మార్ట్ఫోన్ను దేశీయ విపణిలో ఆవిష్కరించాలని ప్లాన్ వేశారు.
కానీ పెరిగిన విడి భాగాల ధరలు, సరఫరా చెయిన్లో అంతరాయాలు.. గూగుల్ సహకారంతో విపణిలోకి రానున్న జియో స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి వాల్యూమ్ తగ్గనున్నది. విపణిలోకి ఆవిష్కరణ జాప్యం అయితే అది గూగుల్-జియోలకు గట్టి ఎదురు దెబ్బ అని భావిస్తున్నారు.
ప్రారంభంలో మార్కెట్లో అడుగు పెట్టిన జియో ఫీచర్ ఫోన్ అంత ఖర్చుతో కూడుకున్నది కాకపోవడంతో లక్షల మంది కొనుగోలు చేశారు. కానీ తాజా గూగుల్-జియో స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఈ నెల 24న జరుగనున్న రిలయన్స్ వార్షిక సమావేశంలో ఈ ఫోన్ను సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో విపణిలోకి అడుగు పెట్టే చాన్స్ కనిపిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల తయారీకి విడి భాగాల సప్లయి చైనా నుంచే జరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో 30-45 రోజుల్లో అవి వచ్చేవి. ప్రస్తుత కరోనా వేళ నెలకొన్న రవాణా అవరోధాల వల్ల విడి భాగాలు చేరుకోవడానికి 60-75 రోజులు పడుతుంది.
స్మార్ట్ ఫోన్ బ్యాటరీ చార్జర్లో వాడే మైక్రో ప్రాసెసర్ ధర 5సెంట్ల నుంచి 9సెంట్లు పెరుగుతుందని భారత్లో రిలయన్స్-గూగుల్ స్మార్ట్ ఫోన్ తయారీ దారు అంచనా వేశారు. భారీ మొత్తంలో చిప్సెట్లు దొరకడం కష్టంగా మారింది. దీనివల్ల ఫోన్ల ధరలు 40 శాతం పెరుగొచ్చని అంచనా.