న్యూఢిల్లీ, డిసెంబర్ 28: డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులకు మరింత సమయం చిక్కింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకుగాను వార్షిక రిటర్నుల్లో ఉన్న వ్యత్యాసాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకున్న గడువుల్ని కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 2018-19కిగాను డిమాండ్ నోటీసుల జారీకి డెడ్లైన్ను వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు, 2019-20కిగాను ఆగస్టు 31దాకా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, ఇంతకుముందు మార్చి 31, జూన్ 30గా ఉన్నాయి. అంతకుముందు ఇవి ఈ నెల 31, వచ్చే ఏడాది మార్చి 31 ఉండేవి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్కు జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి. జీఎస్టీ షార్ట్ పేమెంట్కుగాను ఐసీఐసీఐపై రూ.26.8 కోట్ల నోటీసు వచ్చిం ది. ఇక జొమాటోకు రూ.401.7 కోట్ల జీఎస్టీ లయబుల్ షోకాజ్ నోటీసు వెళ్లింది.