న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రూ.47 వేల మార్కును దాటిన బంగారం ఇవాళ మళ్లీ దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.451 తగ్గి రూ.46,844కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,295 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు రాత్రికి రాత్రి పడిపోవడంతో ఢిల్లీలో బంగారం ధర తగ్గిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక ఢిల్లీ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.559 తగ్గి రూ.67,465కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,024 వద్ద ముగిసింది. అదేవిధంగా డాలర్తో రూపాయి మారకం విలువ కూడా ఇవాళ నాలుగు పైసలు బలపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,805 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర రూ.25.93 అమెరికన్ డాలర్లు పలికింది.