న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 46 వేల దిగువకు చేరుకున్నది. కిలో వెండి సైతం ఏకంగా రూ. 720 తగ్గి రూ.61,540 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.300 చౌకై రూ.48 వేలకు, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.300 తగ్గి రూ.44 వేల వద్ద ఉన్నది. వెండి మాత్రం రూ.100 పెరిగి రూ. 67,800 పలికింది.